హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి గురువారం హుజుర్నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
-ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి.. ఉదయం 10:50 గంటలకు హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంటారు.
-ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
-మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రీన్ వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
-మధ్యాహ్నం 1:45 గంటలకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నివాసంలో లంచ్ చేస్తారు.
-మధ్యాహ్నం 2:30 గంటలకు హుజూర్ నగర్ పట్టణం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి.. మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ టౌన్కు చేరుకుంటారు.
-మధ్యాహ్నం 3:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తారు.
-సాయంత్రం 4:30 గంటలకు చండూరు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
-సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు.