హైదరాబాద్ : సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చైత్రకు న్యాయం జరిగిందంటూ #JusticeForChaithra యాష్ట్యాగ్ను కూడా కేటీఆర్ తన ట్వీట్లో పోస్టు చేశారు. ఈ నెల 9న హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంగతి తెలిసిందే.