రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ మరో గుడ్న్యూస్ చెప్పారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని పంచుకొన్నారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ ఇక్కడ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఆ కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కంపెనీ అధ్యక్షుడు, సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మోరే, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని కేటీఆర్ ట్విట్టర్లో వివరించారు.