హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరా టం చేసిన స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కుమ్రంభీం అని శనివారం మంత్రి ట్విట్టర్లో కొనియాడారు.
భక్తులకు శుభాకాంక్షలు
ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రథోత్సవ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్చేశారు.