హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): మరో టెక్స్టైల్ పార్కుకు తెలంగాణ వేదిక కాబోతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ప్రభుత్వం మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నది. ఈ నెల 17న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. పార్కు శంకుస్థాపనపై సోమవారం చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి ఉపాధి కల్పించేలా సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ పార్ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించామని తెలిపారు. మినీ టెక్స్టైల్ పార్తో ఇకడి ప్రజల కష్టాలు తీరుతాయని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఇటీవలే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్నారని, వారికి వరంగల్ టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో ఆగస్టు నుంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. సమీక్షలో ఐటీ, పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్టైల్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, డైరెక్టర్ మెహర్, యంగ్ ఇండియా, కిటెక్స్ సహా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.