హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడ్డ కేటీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఆగస్టు 30వ తేదీన కేటీఆర్ కరోనా బారిన పడ్డ విషయం విదితమే. కేటీఆర్కు మొదటిసారి 2021, ఏప్రిల్ 23న కరోనా సోకింది.
కరోనా నుంచి కోలుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS
– కరోనా బారిన పడిన మంత్రి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు
– ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్గా నిర్థారణ
– రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్ హాజరుకానున్నారు.
(File Photo) pic.twitter.com/rgYQBtqGQZ
— TRS Party (@trspartyonline) September 5, 2022