WE-HUB | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడంతో మంత్రి కేటీఆర్ ముందుంటారు. తాజాగా ఇద్దరు పాఠశాల విద్యార్థుల సరికొత్త ఆలోచనకు సీడ్ ఫండ్గా రూ.8 లక్షలను శనివారం సమకూర్చారు. వీ హబ్ 5 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు మంచి ఆలోచనతో స్టార్టప్ను ప్రారంభిస్తే అవసరమైన ఫండింగ్ ఇస్తానని మాటిచ్చారు.
ఆ మేరకు బోడుప్పల్లోని పల్లవి మాడల్ స్కూల్కు చెందిన ఎన్ మానసరెడ్డి (గ్రేడ్ 9), నఫీసా అంజుమ్ (గ్రేడ్ 10) డీజీ జ్ఞాన్ పేరుతో స్టార్టప్ ఏర్పాటుచేశారు. వీరి తమ ఆలోచనను మంత్రి ముందు వివరించారు. విద్యార్థినుల ఆలోచనను మెచ్చుకున్న కేటీఆర్.. రూ.8 లక్షల చెక్కును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో విద్యార్థినులకు అందజేశారు.