Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy )కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం( Telangan Movement )లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని కేటీఆర్ చురకలంటిస్తూ ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు అని స్పష్టం చేశారు. మోదీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి అంటూ సూచించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ ( Million March ) ను నిర్వహించి నేటికి పుష్కరకాలం గడిచింది అని కిషన్ రెడ్డి పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాదిమంది ప్రజలతో నిర్వహించిన నాటి మిలియన్ మార్చ్ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది అని చేసిన కిషన్ రెడ్డి ట్వీటుకు కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చెయ్యిమంటే పారిపోయిన దద్దమ్మ నువ్వు@kishanreddybjp pic.twitter.com/z4lbDrAmLj
— Akshay (@AkshayBRS) March 11, 2023