హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం (Komuram Bheem) కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన ‘జల్’, నిన్న కంటికి రెప్పలా కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం ‘జంగల్’ పెరిగిందని, నేడు 1.51 లక్షల మందికి ఏకంగా 4.60 లక్షల ఎకరాల ‘జమీన్’ (భూములు) పంచుతున్నారని చెప్పారు.
గ్రామ పంచాయితీల ఏర్పాటుతో ‘మావ నాటే – మావ రాజ్’ స్వప్నం సాకారమైందని వెల్లడించారు. పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఇలా ఒకటా.. రెండా.. పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన-ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి, పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
నీళ్ళు..
నిధులు..
నియామకాలు..
అనే ఉద్యమ నినాదాలనే కాదు..జల్..
జంగల్..
జమీన్…
అనే కుమ్రం భీం కలలను కూడా..అక్షరాలా..
సాకారం చేసిన..
ధీరోదాత్తమైన నాయకుడు..
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…మొన్న
కొండకోనల్లోని నివాసాలకు
మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్"నిన్న
కంటికి రెప్పలా… pic.twitter.com/WZOZQrTDUf— KTR (@KTRBRS) June 30, 2023