హైదరాబాద్ : భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కొవిడ్పై పోరులో హైదరాబాద్ మరోమారు ముందంజలో ఉందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన ఐనోవాక్ వ్యాక్సిన్ అనుమతులు పొందినందుకు సుచిత్రా ఎల్ల, కృష్ణ ఎల్లకు అభినందనలు తెలిపారు కేటీఆర్. ఐనోవాక్ ప్రపంచంలోనే మొదటి ఇంట్రా నాజల్ వ్యాక్సిన్ అని ఆయన పేర్కొన్నాఉ. ప్రపంచానికి అవసరమైన టీకాలు జీనోమ్ వ్యాలీలో తయారు అవుతున్నాయని తెలిపారు. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
It is the world’s first intranasal vaccine and will ensure protection in the upper respiratory tract. @BharatBiotech proudly produces vaccines at Genome Valley Hyderabad for the world.
— KTR (@KTRTRS) December 23, 2022