Errabelli Dayaker Rao | హైదరాబాద్ : రేపు జన్మదినం జరుపుకోనున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుదీర్ఘకాలం ప్రజా సేవలో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సబిత ఇంద్రా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.