మనకు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలా? పనికిమాలిన డబుల్ ఇంజిన్ పాలన కావాలో తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ టాప్ ఎకనామిక్ ఫెర్మార్మర్ అని ‘గ్రౌండ్ జీరో’ విడుదల చేసిన వీడియోను సోమవారం ఆయన రీ ట్వీట్ చేశారు.
2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1.2లక్షలుండగా అది ఇప్పుడు రూ.2.78 లక్షలకు పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ 2014-15లో 5.06శాతం ఉండగా, 2021-22లో రూ. 11.55లక్షలకు చేరుకుందన్నారు. మొత్తంగా 128 శాతం పెరిగిందని వెల్లడించారు. భారత ఎకానమీకి తెలంగాణ నాలుగో అతిపెద్ద కంట్రిబ్యూటర్గా మారిందని వివరించారు.