గట్టుప్పల్, అక్టోబర్ 22: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రానున్నారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు గట్టుప్పల్లోని పుట్టపాక రోడ్డు నుంచి రోడ్ షో ప్రారంభం కానున్నది.
పుట్టపాక రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం, మార్కండేయ గుడి, బొడ్రాయి బజార్, కనకదుర్గమ్మ గుడి, వివేకానంద చౌరస్తా వరకు రోడ్ షో సాగనున్నది. అక్కడ ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. రోడ్ షోలో మంత్రి జగదీశ్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొంటారని జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, సర్పంచ్ ఇడెం రోజా తెలిపారు.