Minister KTR | వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ప్రగతి భవన్ నుంచి మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరద పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాణనష్టం జరుగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు. పునరాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు. పురపాలికలో సహాయ చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
Reviewed the excess rainfall & resultant situation within GHMC & all other Towns in the state with Municipal Administration team through a VC
Have asked Special CS MA&UD @arvindkumar_ias to monitor closely along with @CommissionrGHMC @MDHMWSSB @cdmatelangana pic.twitter.com/KbI0tdbSaS
— KTR (@KTRTRS) July 27, 2022