కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 10 : పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గంగుల నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ గంగుల తండ్రి మ ల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటిం చి, నివాళులర్పించారు.
మం త్రి గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించి, శోక సముద్రంలో మునిగిన వారిని ఓదార్చారు. మల్లయ్య మరణంపై గంగుల సోదరులు వెంకన్న, సుధాకర్ను వివరాలడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు.