చౌటుప్పల్ : డబ్బు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అహంకారం. వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్లో బుధవారం రోడ్ షో(Road show)లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గెలిసిస్తే కరెంట్ కాటగలుస్తది. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఫ్లోరైడ్తో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల నడుములు ఒంగినై. ఆ బాధలు చూడలేక సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పైలన్ కూడా చౌటుప్పల్లో ఆవిష్కరించారని గుర్తు చేశారు. మరిన్ని అభివృద్ధి పనులు జరగాలంటే మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.