న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. ఎస్టీపీల నిర్మాణాలకు రూ. 8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని వినతి చేశారు. హైదరాబాద్లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్కు సహకరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్.. గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. @KTRTRS pic.twitter.com/x77T0Xyp4v
— Namasthe Telangana (@ntdailyonline) June 23, 2022