హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నా, కొవిడ్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోం ఐసొలేషన్లోనే ఉన్నా.
కొన్ని రోజులుగా నన్ను కలిసినవారు పరీక్ష లు చేయించుకోవాలి. ముందస్తు జా గ్రత్తలు పాటించాలి’ అని సూచించా రు. కేటీఆర్ ట్వీట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.