Minister KTR | సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేదని.. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ఒక ధైర్యమని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రంలో వైద్యరంగంలో సంతరించుకున్న మార్పులపై కేటీఆర్ సుదీర్ఘ ట్వీట్ ద్వారా వివరించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ కిట్ల నుంచి న్యూట్రిషన్ కిట్ల దాకా.. డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నొస్టిక్ కేంద్రాల దాకా.. ప్రతి ఆలోచన ప్రతిష్టాత్మకమని, ప్రతి నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రస్థానం దేశంలోనే ఒక సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు.
“నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు” అనే దశాబ్దాల దుస్థితి నుంచి… “చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు” అనే ధీమానిచ్చిన ధీరోదాత్తమైన నాయకత్వం తెలంగాణ సొంతం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నలుదిశలా ఒకేసారి ప్రభుత్వరంగంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవం అని చెప్పారు. జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పం.. డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలలను సాకారం చేసే మహాయజ్ఞం అని స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో
ప్రజారోగ్యం అంటే.. గాలిలో దీపం
స్వరాష్ట్రంలో
ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపం.నాడు…
సర్కార్ దవాఖానా అంటే దైన్యం
నేడు…
ప్రభుత్వ ఆసుపత్రికెళితే ఒక ధైర్యంకేసీఅర్ కిట్ల నుంచి…
న్యూట్రిషన్ కిట్ల దాకా…
డయాలసిస్ సెంటర్ల నుంచి…
డయాగ్నొస్టిక్ కేంద్రాల… pic.twitter.com/n2SdzlzHtG— KTR (@KTRBRS) June 14, 2023
తొలి ఏడాది నుంచి తొమ్మిదో వసంతం దాకా..
బడ్జెట్ లో వైద్యరంగానికి పెద్దపీట
కార్పొరేట్ కి ధీటుగా ప్రతియేటా బంగారుబాట
కరోనా కష్టకాలంలో
ప్రజల్ని కంటికి రెప్పలా
కాపాడిన తీరు అపూర్వం..
ప్రాణాలకు తెగించి
సేవలందించిన అందరికీ
మరోసారి చేతులెత్తి సలాం…
దశాబ్దాలపాటు
చిక్కిశల్యమైన ప్రజారోగ్యానికి
శస్త్రచికిత్స సక్సెస్ అయిన వేళ…
“ఆరోగ్య తెలంగాణ” కోసం
క్షేత్ర స్థాయి నుంచి..
రాష్ట్ర స్థాయి వరకూ..
అహర్నిశలు శ్రమిస్తున్న
వైద్యారోగ్య శాఖలోని ప్రతిఒక్కరికీ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
హృదయ పూర్వక శుభాకాంక్షలు. ‘ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు.