Minister KTR |రూ.224కోట్లతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. సమీకృత కూరగాయల మార్కెట్కు, గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరం, పౌరసేవా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసునన్నారు.
ప్రభుత్వం అడగక ముందే అన్ని ఇస్తోందని, గతానికి ఇప్పటికీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యిందో మీకు తెలుసునన్నారు. గతంలో అభివృద్ధి నిధుల కోసం నానాతంటాలు పడాల్సి వచ్చేదని, నేడు ఎక్కడ అభివృద్ధి అవసరమో అక్కడ ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడి ప్రారంభోతున్నామని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తేనే ఆదాయం వస్తుందన్నారు. సిద్ధిపేటలో తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసే ప్లాంట్ నడుస్తోందని, సిద్ధిపేట తరహాలో అన్ని మున్సిపాలిటీల్లో ఎరువుల తయారీ జరగాలన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.