కేసముద్రం, నవంబర్ 4: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నిరుపేద విద్యార్థి బదావత్ గణేశ్ ఉన్నత చదువుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభయమిచ్చారు. గణేశ్ నీట్లో ఆల్ ఇండియా ఎస్టీ విభాగంలో 829వ ర్యాంక్ సాధించి నిజామాబాద్ వైద్య కళాశాలలో సీటు పొందాడు.
చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేదని, సాయం చేయాలని పలు మాధ్యమాల ద్వారా కోరాడు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. గణేశ్ను ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.