నిర్మల్ (నమస్తే తెలంగాణ)/బాసర, డిసెంబర్ 10: బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. విద్యార్థుల డిమాండ్లు యుద్ధ ప్రాతిపాదికన నెరవేరుతున్నాయి. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సకల సౌలత్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలపై విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న బాసర ట్రిపుల్ ఐటీని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నాటి నుంచే మంత్రి విద్యార్థుల ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా సమస్యలను యుద్ధ ప్రాతిపదిన తీర్చారు. ఇంచార్జి వీసీ వెంకరటమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్కుమార్తో కలిసి మంత్రి ప్రక్షాళన ప్రారంభించారు.
మంత్రి కేటీఆర్ చొరవతో తీరిన సమస్యలు ఇవే..