హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దేశంలో రూపాయి పతనానికి కారణమేమిటో జవాబివ్వాలని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. బీజేపీ సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ట్విట్టర్లో మస్ట్ ఆన్సర్ మోదీ అన్న హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో నెటిజన్లు వందలకొద్దీ ప్రశ్నలు వేశారు. మంత్రి కేటీఆర్ కూడా ఆదివారం అదే హ్యాష్ట్యాగ్తో మోదీని నిలదీశారు. ‘మోదీజీకి నా సూటి ప్రశ్న, భారత రూపాయి పతనమవడానికి కారణం ఏంటి..? బీజేపీకి చెందిన ఉత్తర కుమారులు ఎవరి దగ్గరైన ఈ ప్రశ్నకు సమాధానం ఉందా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
అహ్మదాబాద్ను అదానీబాద్గా మార్చుకోండి!
బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చుతామని జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్దాస్ చేసిన ట్వీట్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ‘అహ్మదాబాద్ పేరును అదానీబాద్గా మీరు ఎందుకు మార్చకూడదు’ అని చురక అంటించారు. ఇంతకీ ఈ జుమ్లా జీవి ఎవరని ట్వీట్లో ప్రశ్నించారు.