హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ‘ఎన్పీఏ’ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీ య ప్రయోజనాలే ముఖ్యం కావడం విచారకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారా వు అన్నారు. బల్క్ డ్రగ్ పార్కుపై శుక్రవారం లోక్సభలో తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెంటనే తెలంగాణ ప్రజలకు క్ష మాపణ చెప్పాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు. లైఫ్ సైన్సెస్కు హబ్ గా ఉన్న హైదరాబాద్కు బల్క్ డ్రగ్ పా ర్కును మంజూరు చేయకపోవడం దేశానికి నష్టదాయకమని పేర్కొన్నారు. కేం ద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల మనసును గాయపరిచార ని కేటీఆర్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. ఆయన తప్పుడు ప్రకటనపై సభాహక్కుల నోటీసు ఇ వ్వాలని లోక్సభ టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావుకు మంత్రి కేటీఆర్ సూచించారు.