హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా జరిగిన ఫిక్కీ ఎఫ్ఎల్ఓ(ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్) అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఫిక్కీ ఎఫ్ఎల్వో ప్రతినిధులు జయంతి దాల్మియా, పింకీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారంలో రాణిస్తున్న మహిళలకు కేటీఆర్ అవార్డులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యాపార రంగంలో మహిళలు మరింత ముందుకు రావాలి. సుచిత్ర ఎల్ల, మహిమ దాట్ల సమర్థవంతంగా సంస్థలను నిర్వహిస్తున్నారు. దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదే అని పేర్కొన్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలోనే నిర్మించామని కేటీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో పురోగతి సాధించామని తెలిపారు.