హైదరాబాద్ : అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో అనేక పథకాలు సాధించిన పంజాబ్కు చెందిన యువ దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు వ్యక్తిగత స్థాయి సహాయం అందించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకువచ్చారు. చెస్ తనకున్న ప్రతిభాపాటవాలతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించినా.. తనకు ఎలాంటి సహకారం అందడం లేదని ఓ వీడియోలో వ్యక్తం చేసింది.
ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మాలిక ఆవేదన మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో వ్యక్తిగతంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది మాలిక కుటుంబ సభ్యులను సంప్రదించారు. పంజాబ్కు చెందిన తన కూతురికి సుదూరంలో ఉన్న మంత్రి కేటీఆర్ సహాయం అందించేందుకు ముందుకు రావడంపై మాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.