సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 6: పేదల వైద్యానికి భరోసా కల్పిస్తున్నారు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో మంత్రి కేటీఆర్ రూ.4 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. ఈ ఎల్వోసీని బుధవారం టీఆర్ఎస్ నాయకులు తరుణ్ కుటుంబానికి అందజేశారు. అలాగే నిమ్స్లో చికిత్స పొందుతున్న జిల్లెల్లకు చెందిన బర్ల పోచయ్య గుండె ఆపరేషన్ కోసం రూ.2 లక్షల ఎల్వోసీని మంత్రి మంజూరు చేశారు. సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు ఎల్వోసీని బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు.