హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని వినియోగించుకుంటూ ఆదర్శ గ్రామంగా నిలిచింది ముఖ్రా కే(ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం). రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను ముఖ్రా కే గ్రామం సద్వినియోగిం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్రా కే గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షిని కేటీఆర్ అభినందించారు.
ఇక ఈ గ్రామంలో తడి చెత్త ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేసి రూ. 6 లక్షల ఆదాయాన్ని సంపాదించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం, గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్రా కే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు.
పల్లె ప్రగతితో ముఖ్రా కె గ్రామం అందరికీ ఆదర్శం – మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ @KTRTRS.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్ గాడ్గె మినాక్షి గారిని అభినందించిన మంత్రి కేటీఆర్.#PallePragathi
1/3 pic.twitter.com/VbG1E2Oj7Z
— TRS Party (@trspartyonline) July 5, 2022