హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) పది రోజులపాటు అమెరికాలో పర్యటించినున్నారు. ఈ నెల 29 వరకు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలను సందర్శిస్తారు. లాస్ఏంజిల్స్తో ప్రారంభమయ్యే మంత్రి పర్యటన.. 20న శాండియాగో, 21న శాన్జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్లో కొనసాగుతుంది. కంపెనీల అధిపతులు, సీఈవోలను సమావేశమవుతారు.
మంత్రి కేటీఆర్తోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, పలువురు అధికారులు అమెరికా వెళ్లనున్నారు.