జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలే పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన దాదాపు 60 మంది కాంగ్రెస్ (Congress), బీజేపీ(BJP) పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలలో చర్చ జరుపాలని సూచించారు.