పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనిరాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల వల్ల రోగులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని వెల్లడించారు. పెద్దపల్లి (Peddapalli)జిల్లా కేంద్రంలో రూ.5 .25 లక్షలతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్, రూ.కోటితో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉండేవిధంగా సీఎం కేసీఆర్(CM KCR) ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను నెలకొల్పుతున్నారని చెప్పారు. నర్సింగ్ కాలేజీలు(Nursing College), మాతా, శిశు ఆరోగ్య కేంద్రాలు, ప్రతి నియోజకవర్గ పరిధిలో డయాలసిస్ కేంద్రం(Dialysis center), ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లో పరీక్షలు నిర్వహించి జిల్లా కేంద్రానికి పరీక్ష నమూనాలు తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
పెద్దపల్లిలో సైతం వంద పడకల మాతా, శిశు ఆసుపత్రి నిర్మించుకున్నామని, కోటి రూపాయలతో ఐదు పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభించుకున్నామని తెలిపారు. ఫిజియోథెరపీ కేంద్రం, సైకాలజీ వైద్య చికిత్సలు సైతం అందుబాటులోకి వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.