పెద్దపల్లి : భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అదివారం గోదావరిఖని పట్టణంలోని జయదుర్గా దేవి, ఆయ్యప్ప స్వామివారి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రజలందరికి 2022లో శుభం కలుగాలన్నారు.
కారోనా నుంచి విముక్తి కలుగాలనీ భగవంతున్ని వేడుకున్నామని తెలిపారు. మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, పాతపెల్లి ఎల్లయ్య, అడ్దాల రామస్వామి, చెలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, తోకల రమేష్, చల్ల రవీందర్ రెడ్డి, సట్టు శ్రీనివాస్ జిట్టవేన దేవి, లక్ష్మీ నర్సయ్య ఉన్నారు.