జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో రూ.4 కోట్ల 61 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు నిర్మాణానికి, శంకుస్థాపనలు, మహిళల, కుర్మ సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.