హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం పేదలకు వరమని అభివర్ణించారు.
సొంత స్థలం ఉన్న పేదలు ఇంటి నిర్మాణానికి 100% రాయితీతో మూడు దశల్లో రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 3 వేల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడంతో అర్హులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల పేరు మీద ఈ సాయం అందిస్తుండటం గొప్పవిషయమని తెలిపారు.