ధర్మపురి రూరల్, జనవరి 8: ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పథకంతో తెలంగాణ ఫిష్హబ్గా మారిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నిరుపేదలైన మత్స్యకారులను లక్షాధికారులుగా చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర పథకానికి అంకురార్పణ చేశారని చెప్పారు. శనివారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండలోని బోలి చెరువులో మంత్రి.. 42 వేల రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపల పెంపకందారులకు రాయితీపై వాహనాలు, వలలు, ఇతరత్రా సామగ్రి ఇచ్చి ఆర్థికంగా అండగా నిలిచిందని పేర్కొన్నారు.