Minister Koppula Eshwar | కాంగ్రెస్, బీజేపీ నేతల బోగస్ మాటలు నమ్మి.. కష్టాలు కొని తెచ్చుకోవద్దని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ దెబ్బకు ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఖాళీ అవుతాయన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని చెప్పారు.
ధర్మపురిలో గోదావరి వరద నీరు ఇళ్లలోకి రాకుండా గోదావరి ఒడ్డున రక్షణ గోడ నిర్మిస్తాననని హామీ ఇచ్చారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటిగా అప్గ్రేడ్ చేయించి అన్నిరంగాల్లో ముందునిలిపామని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే వారి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అమలు చేయించాలని సవాల్ విసిరారు. ప్రజలు వారికి ఓటేస్తే 24 గంటల కరెంట్ వస్తుందా? అని ఆలోచించాలని కోరారు. ఆ పార్టీ నేతల బూటకపు వాగ్ధానాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.