హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం మొదటి విడత యూనిట్ల గ్రౌండింగ్ అం తా వారంలోగా పూర్తవుతుందని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ పలు పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. దళితబంధుకు ప్రభు త్వం సరిపడా నిధులు విడుదల చేయడం లేదంటూ తప్పుడు వార్తలు రాయడాన్ని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఖం డించారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో 1, 298 మంది లబ్ధిదారుల కు చెందిన 1,268 ఖాతా ల్లో నగదు జమ చేశామని, ఆ మేరకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యిందని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,462 మందికిగాను 3,320 మంది ఖాతాల్లోకి నగదు జమ చేశామని, 3,314 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందని, నాగర్కర్నూల్ జిల్లా చారుగొండ మండలంలో 1,407 మందికిగాను 1,373 మంది ఖాతాల్లో నగదు జమ చేయగా, 1,373 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో 2,223 మందికిగాను 2,002 మంది ఖాతాల్లో నగదు జమ చేయగా, 745 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో 100 చొప్పున యూనిట్లకుగాను ఇప్పటివరకు 11,835 మంది లబ్ధిదారులకుగాను 11,739 మంది ఖాతాల్లో పూర్తి నగదు జమ చేయగా.. 11,301 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందని మంత్రి స్పష్టంచేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పశువులకు ముఖ్యంగా ఆవులు, బర్రెలకు లంపీ వ్యాధి సోకడంతో వాటి రవాణా నిలిచిపోయిందని తెలిపారు.