జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం తుదిశ్వాస విడిచారు.
కాగా, ఆదివారం ధర్మపురిలో రాజారెడ్డి అంతిమ యాత్రలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రాజారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎల్లాల కుటుంబ సభ్యులను పరామర్శించి, మంత్రి ఓదార్చారు.