హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మే 13 న దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అభినందన(Appreciation )సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం( Ambedkar Statue) ఏర్పాటు చేసుకున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో దళిత ,గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అంబేద్కర్(Ambedkar) ఆశయాలను అమలుచేసి చూపించడంతో పాటు ఆయన కలలను సీఎం కేసీఆర్ (CM KCR) సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవం దక్కించిందన్నారు. ఆర్టికల్-3 ఆధారంగా తెలంగాణ ఏర్పడిందని, అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని( Broze statue) ఏర్పాటు చేయించారని పేర్కొన్నారు. ఈ విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని వెల్లడించారు.
మే 13 న సభా స్థలం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాసటగా నిలువాలని కోరారు. ఎక్కడా లేని విధంగా రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దళిత వర్గాల్లో ఆర్థికవికాసానికి ‘దళిత బంధు’ (Dalit Bandu)పథకాన్ని ప్రవేశ పెట్టి 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలు , ఎస్సీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేయడంతోపాటు విదేశాల్లో చదివేందుకు 20 లక్షల సాయం అందించి ప్రోత్సహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల పేరుతో నిధులు కేటాయించినప్పటికీ ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూర్చ లేకపోయాయని విమర్శించారు.ఈ సమావేశంలో రాజీవ్ సాగర్ సహా పలువురు దళిత గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.