హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాం సృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎఫ్ఐటీయూఆర్ పేరుతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని ఐఎఫ్ఈఎంఏలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోనాలను కన్నుల పండువగా నిర్వహించారు. ఒగ్గుడోలు, ఒగ్గుకథ, కూచిపూడి, భరతనాట్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.