సూర్యాపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వంగా ఉన్నాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
గురువారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఏపీ ప్రజల వైపు నిలబడితే ఆంధ్రా మంత్రులకు భయమెందుకని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని తేల్చిచెప్పారు.