సూర్యాపేట : రాష్ట్ర గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagdishreddy ఫైర్ అయ్యారు.
ఆమె గవర్నరా, బీజేపీ నాయకురాలా అంటూ మండి పడ్డారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమె కెక్కడిదని ప్రశ్నించారు.మంగళవారం సూర్యాపేట(suryapeta district)లో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారని అన్నారు.
రాజ్యాంగ మూలసూత్రాలను కాదని చట్టాలు అధిగమించమనిపిస్తే అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మసనానికే ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పెట్టేలా ఉందని వెల్లడించారు.గవర్నర్ తీరు భారత ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని విమర్శించారు. బీజేపీ యోతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.
గవర్నర్ను అడ్డుపెట్టుకుని కేసీఆర్(KCR) చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలకు మోకాలోడ్డే ప్రయత్నం చేస్తుందన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక కుటిన ప్రయత్నాలు చేస్తుందని మంత్రి ఆరోపించారు.