రవీంద్రభారతి/ఖైరతాబాద్/చివ్వెంల, జూన్ 5: సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్తు రంగంలో పురోభివృద్ధి సాధించామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని, జాతీయ తలసరి వినియోగంతో పోల్చి తే 69.40 శాతం ఎక్కువగా కరెంట్ ను వాడుతున్నట్టు తెలిపారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతం, విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతి అని చెప్పారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ సబ్స్టేషన్ ప్రాంగణం లో నిర్వహించిన విద్యుత్తు ప్రగతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన రోజు విద్యుత్తు ఉత్ప త్తి 7,778 మెగావాట్లు ఉండగా, సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు 18,567 మెగావాట్లకు చేరుకున్నదని తెలిపారు. ఉమ్మడి ఏపీలో పీక్ డిమాండ్ 13 వేల మెగావాట్లు ఉండగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే పీక్ డిమాండ్ 14,700 మెగావాట్లుగా నమోదవుతున్నదని చెప్పారు. ఇది విద్యు త్తు రంగంలో సాధించిన ప్రగతికి అద్దం పడుతున్నదని మంత్రి చెప్పారు. దేశం నలువైపుల నుంచి తె లంగాణ విద్యుత్తు ట్రాన్స్మిషన్కు తగిన వెసులుబాటు ఉన్నదని తెలిపారు. 2014కు ముందు ఎం దుకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేక పోయారు.. ఇప్పుడెలా సాధ్యమైందో ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యు త్తు కోతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు నేడు ప్రశంసలు కురిస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్, ఆలోచన విధానమే తెలంగాణలో విద్యుత్తు ప్రగతి కారణమని చెప్పారు.
విద్యుత్తు కాంతులు కేసీఆర్తోనే: ప్రభాకర్రావు
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్తు రంగంలో పురోభివృద్ధి సాధించామని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డీ ప్రభాకర్రావు చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని విద్యుత్తుశాఖ కార్యాలయంలో విద్యుత్తు ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కరెంట్ సంక్షోభాన్ని నివారించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించారని తెలిపారు. తెలంగాణ రాక ముందే 2014 ఏప్రిల్ 29న నాటి ఉద్యమ నేత కేసీఆర్ తనను పిలిపించుకొని మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యుత్తు రంగంలో ఉన్న సంక్షోభ నివారణ కోసం ప్రణాళికను చెప్పమన్నారని తెలిపారు. తెలంగాణ రాకముందే విద్యుత్తు సంస్థకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. నేడు రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందంటే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాయే కారణమని పేర్కొన్నారు.
నేడు 15,497 మెగావాట్లు: రఘుమారెడ్డి
కొత్త రాష్ట్రంలో కేవలం 5,661 మెగావాట్లు ఉం టే, నేడు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 15,497 మెగావాట్లకు చేరిందని టీఎస్ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. థర్మల్, హైడల్, సోలార్ తదితర వనరుల ద్వారా 7,778 మెగావాట్ల ఉండగా, ప్రస్తుతం 18,567 మెగావాట్లకు చేరిందని తెలిపా రు. నిరంతర విద్యుత్తు సరఫరాతో బంగారు తెలంగాణకు బలమైన పునాదులు వేశామని చెప్పారు.
ఆర్థిక ప్రగతిని మార్చిన విద్యుత్తు: గోపాల్రావు
24 గంటల విద్యుత్తు సరఫరా వల్ల తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు చెప్పారు. తెలంగాణలో వరి, మకజొన్న సాగు గణనీయంగా పెరిగిందని అన్నారు. రూ.7086 కోట్లతో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. తలసరి విద్యుత్తు వినియోగం 1473 కేడబ్ల్ల్యూహెచ్గా పెరిగిందని తెలిపారు. కార్యక్రమాల్లో రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్శర్మ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, జెన్కో చీఫ్ ఇంజినీర్ సురేశ్, సీఎండీలు, డైరెక్టర్లు ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.