సూర్యాపేట : ఇచ్చిన మాట ప్రకారం చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన సాహసి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ అని సూర్యాపేట (Suryapet) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy )అన్నారు. మంగళవారం సూర్యా పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు ఎలా చేరాలో పాలనలో చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.
సూర్యాపేట అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కరువు నేల అయిన సూర్యాపేటను కాళేశ్వరం జలాలతో సాగు, తాగు నీరు అందించి సమస్యలు లేకుండా చేశారన్నారు. సూర్యాపేటను కోనసీమాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది. అడిగినన్ని నిధులు అందించి అనేక అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. సూర్యాపేటలో యువతకు ఉపాధి కల్పించేం దుకు డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పటు చేయాలి. అలాగే ఐటీ హబ్ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ను కోరారు. ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేటను టూరిస్టు సర్కిల్గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.