సూర్యాపేట : భావి భారత క్రికెట్ క్రీడాకారులును తయారు చేయడమే లక్ష్యంగా సూర్యాపేటలో మరో క్రికెట్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణం, కుడ కుడ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.జి.ఎం క్రికెట్ గ్రాండ్ , అకాడమీని హైదరబాద్ క్రికెట్ అసోసియేన్ కోచ్ గోపాల్, తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్తో కలిసి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయన్నారు.
జీవితంలో వచ్చే ఆటు పోట్లను ఎదుర్కోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్ధిలో భాగంగా యూత్ను ప్రోత్సహించాలానే ఉద్దేశంతో త్వరలోనే ప్రభుత్వం నుంచి యువతకు క్రీడా కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అకాడమీ సేవలు అందించాలని సూచించారు. ఎస్.జీ.ఎం అకాడమీ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే కిశోర్ కుమార్ క్రికెట్ ఆడి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, జుట్టుకొండ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్షులు సవరాల సత్య నారాయణ, బూరబాల సైదులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రంగినేని లక్ష్మణ్ రావ్, గుండపునేని కిరణ్, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అన్నపూర్ణ నరేందర్, రఫీ, రమా కిరణ్,
ఎస్.జీ.ఎం అకాడమీ యాజమాన్యం మైనం చంద్ర శేఖర్, మేక పోతుల సంతోష్ గౌడ్, గాలి ప్రవీణ్, వెన్న శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.