సూర్యాపేట : భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ( Abdul Kalam) అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) కొనియాడారు. సూర్యాపేట లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో కలాం వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి కలాం దేశానికి చేసిన సేవ వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
భారత్లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో అబ్దుల్ కలాం ఒకరని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించారు. అంతకు ముందు మంత్రి సూర్యాపేట (Surya Peta) పట్టణం లో సుందరీ కరణ పనులను పరిశీలించారు. మెడికల్ కాలేజ్, సద్దుల చెరువు మినీ టాంక్ బండ్ వద్ద జరిగిన , జరుగాల్సిన పనులను పర్యవేక్షించారు.
ఎన్టీఆర్ చౌరస్తా, జనగాం క్రాస్ రోడ్స్ లో ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ పార్క్ వద్ద గల రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులు సూచించారు.