హైదరాబాద్ : వ్యవసాయం రంగంలో అద్భుతాలు సృష్టించి ఎంఎస్ స్వామినాధన్ మరణం వ్యవసాయ రంగానికి పూడ్చ లేనిదని రాష్ట్ర విద్యుత్ శా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితా మహుడిగా పేరొందిన స్వామినాథన్ మరణం పట్ల ఆయన ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఉత్పన్నమైన ఆహార ధాన్యాల కొరతను అధిగమించడంలో స్వామినాథన్ జరిపిన పరిశోధనలు ఎంతగానో దోహద పడ్డాయన్నారు.
అధిక దిగుబడులు రాబట్టడం ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగానికి ఆదాయం మెరుగు పడడంలో కూడా స్వామినాథన్ పరిశోధనలు తోడ్పడ్డాయాన్నారు.అటువంటి మహనీయులు మనలను విడిచిపెట్టి పోవడం బాధకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.