Minister Jagadish Reddy | బీఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగంతోనే భారతదేశం నిలబడిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాలతో సతమతమవుతున్న దేశాన్ని రాజ్యాంగంతో నిలబెట్టిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్
అందరివాడన్న మంత్రి.. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆలోచనలను పాలకులకు గుర్తు చేసేందుకే తెలంగాణ సచివాలయానికి మహనీయుడి పేరు నామకరణం చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచనలను గుర్తించిన ఘనత కేసీఆర్దేన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకే కేసీఆర్ తెచ్చిన దళితబందు పథకం అందులో భాగమేనని
తెలిపారు. కార్యక్రమంలో గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహరావు, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, లక్ష్మణ్, జాణయ్య పాల్గొన్నారు.