హైదరాబాద్: టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు 21 ఏండ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు.
ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ సారధ్యంలో 21 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. ఉద్యమ ఆంకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందన్నారు.