హైదరాబాద్ : ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జూపార్క్ సందర్శనకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్శనలో భాగంగా సీసీ కెమెరా కంట్రోల్ రూమ్, వైల్డ్ డాగ్ ఎన్క్లోజర్, పక్షుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్తో పాటు ఆధునీకరించిన సఫారీ గేట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంత్రి సందర్శనకు సంబంధించి జూ క్యూరేటర్ రాజశేఖర్ ఏర్పాట్లు పూర్తి చేశారు.